ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  బడిబాట కార్యక్రమానికి రంగం సిద్ధం – జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు

బడిబాట కార్యక్రమానికి రంగం సిద్ధం – జూన్ 6 నుంచి 19వ తేదీ వరకు ప్రతిరోజూ ప్రత్యేక కార్యక్రమాలు

పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రతియేటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని ఈసారి జూన్ 6 నుండి 19వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు మండల విద్యాధికారి గడ్డం మంజూల శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యాసంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని పాఠశాలల్లో ప్రభుత్వ ఆదేశాల మేరకు విశేషంగా నిర్వహించనున్నట్లు చెప్పారు.

రోజువారీ కార్యక్రమాల వివరాలు:
🔸 జూన్ 6: తొలి రోజు గ్రామసభల నిర్వహణ. తల్లిదండ్రులు, గ్రామస్తుల సలహాలు, సూచనలు తీసుకుని విద్యార్థుల సంఖ్య పెంపుకు చర్యలు.
🔸 జూన్ 7: ఇంటింటికీ వెళ్లి బడిబాలురను గుర్తించాలి.
🔸 జూన్ 8-10: కరపత్రాలతో ఇంటింటి ప్రచారం, అంగన్‌వాడీ కేంద్రాల సందర్శన, డ్రాప్‌ఔట్ పిల్లల గుర్తింపు, భవిత కేంద్రాల్లో చేర్పింపు.
🔸 జూన్ 11: ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాలపై సమీక్ష సమావేశం.
🔸 జూన్ 12: అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీల ఆధ్వర్యంలో కార్యక్రమాల ప్రారంభం, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్, యూనిఫాంల పంపిణీ.
🔸 జూన్ 13: సామూహిక అక్షరాభ్యాసం, బాలలసభ నిర్వహణ.
🔸 జూన్ 16: FLN & LIP దినోత్సవం నిర్వహణ.
🔸 జూన్ 17: విలీన విద్య, బాలిక విద్యా దినోత్సవం.
🔸 జూన్ 18: తరగతుల డిజిటలీకరణ అవగాహన, మొక్కల పెంపకం ప్రాధాన్యతపై విద్యార్థులకు తెలియజేత.
🔸 జూన్ 19: బడిబాట ముగింపు సందర్భంగా విద్యార్థులకు క్రీడాపోటీలు.

ఈ సందర్భంగా ఎంఈవో మంజూల మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలలలో ఉన్న వసతులు, నాణ్యమైన బోధనను ప్రజలకు తెలియజేసి, మరిన్ని విద్యార్థులను చేరదీసేలా ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ కమిటీలు చొరవ చూపాలని పిలుపునిచ్చారు. “ప్రజలు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించాలని, ఈ కార్యక్రమం విద్యా ప్రమాణాలు మెరుగుపరచడంలో మేల్కొలుపు కావాలని ఆశిస్తున్నాం” అని తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….