ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి, మరొకరు గాయాలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: బైక్ చెట్టును ఢీకొనడంతో ఒకరు మృతి, మరొకరు గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, ఇల్లందు మండలం పరిధిలోని అశోక్ నగర్ సమీపంలో శనివారం ఉదయం దురదృష్టకర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వస్తున్న మోటార్ సైకిల్ అదుపు తప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన కలకలం రేపుతోంది.

ప్రమాదంలో మృతుడు మామిడిగుండాల గ్రామపంచాయతీకి చెందిన మేడికుంట గ్రామానికి చెందిన తెల్లం రామ్మూర్తి (30)గా గుర్తించామని పోలీసులు తెలిపారు. వ్యవసాయ కూలీగా పనిచేస్తున్న రామ్మూర్తి తన స్నేహితుడు చింత రవితో (35) కలిసి మోటార్ సైకిల్‌పై ఇల్లందు వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైక్ వేగంగా ఉండటం వల్ల అదుపుతప్పి చెట్టును ఢీకొట్టినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

ప్రమాద సమయంలో రామ్మూర్తికి తలకు తీవ్ర గాయాలవడంతో సంఘటన స్థలంలోనే మృతి చెందారు. అతనితో ఉన్న చింత రవికి తీవ్ర గాయాలవడంతో స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం ఇచ్చి, ఆయనను ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతానికి రవిని వైద్యులు చికిత్స అందిస్తూ, ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని తెలిపారు.

ప్రమాద ఘటనపై సమాచారం అందుకున్న ఇల్లందు పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….