ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  సింగారం పంచాయతీలో తాగునీటి సంక్షోభం సాయి నగర్ వాసుల గుక్కెడు నీటికోసం నరకయాతన

సింగారం పంచాయతీలో తాగునీటి సంక్షోభం
సాయి నగర్ వాసుల గుక్కెడు నీటికోసం నరకయాతన

మణుగూరు, మే 13 , ఆధాబ్ న్యూస్: భయంకరమైన వేసవి ఒత్తిడిలో సమితి సింగారం పంచాయతీలోని సాయి నగర్ వాసులు తాగునీటి సమస్యతో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత వారం రోజులుగా మిషన్ భగీరథ ద్వారా సరఫరా అయ్యే మంచినీటి పంపిణీ పూర్తిగా నిలిచిపోయింది. దీంతో మహిళలు బిందెలు పట్టుకుని మైళ్లు దూరం వెళ్లి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లేమీ లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. పంచాయతీ, మండల స్థాయి అధికారులు స్పందించకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయంపై స్పందించిన సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి మాట్లాడుతూ, “గ్రామంలో నీటి కొరత తీవ్రమవుతోంది. అధికారులు స్పందించకపోవడం బాధాకరం. కనీసం ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడం కూడా మరిచిపోయారు,” అని అన్నారు.

“ప్రతి రాత్రి నల్లాలు వస్తాయేమోనని ఎదురుచూడాల్సిన పరిస్థితి. ప్రజలు పనులు మానేసి నీటి కోసం పడిగాపులు కాస్తున్నారు. అయినా అధికారులు చలించడంలేదు,” అని ఆయన విమర్శించారు. పంచాయతీకి ప్రత్యేక అధికారి ఉన్నా, గ్రామస్థుల గోస పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

రవి తెలిపారు, తాగునీటి సమస్యపై ఫోన్ చేసినా అధికారులు స్పందించడంలేదని, బాధితులు ఎవరిని సంప్రదించాలో తెలియక గందరగోళానికి గురవుతున్నారని అన్నారు. “ఇదే తీరును కొనసాగిస్తే, ప్రజలతో కలిసి పంచాయతీ కార్యాలయం ఎదుట ఆందోళన కార్యక్రమాలు చేపడతాం,” అని హెచ్చరించారు.

జిల్లా అధికారుల జోక్యం అవసరం
ప్రస్తుతం గ్రామంలో నీటి సరఫరాకు అవసరమైన వనరులు ఉన్నా, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని కర్నె రవి మండిపడ్డారు. తక్షణమే జిల్లా అధికారులు స్పందించి తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….