ప్రతి క్షణం
ప్రజల పక్షం

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్ కరకగూడెంలో ఎఫ్‌ఎల్‌ఎన్ అసెస్‌మెంట్ పరీక్షలు రేగా కాంతారావుపై కేసు కొట్టివేత.. కరకగూడెంలో బీఆర్ఎస్ శ్రేణుల సంబరాలు హైకోర్టులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుకు భారీ ఊరట

  రాజుపేట, విట్టల్ రావు నగర్ రైతుల పినపాక ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత.

రాజుపేట, విట్టల్ రావు నగర్ రైతుల పినపాక ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత.

మణుగూరు,ఆధాబ్ న్యూస్: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును బుధవారం నాడు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన రాజుపేట, విట్టల్ రావు నగర్, పీకే వన్ సెంటర్ గ్రామస్తులు, రైతులు తమ ప్రాంత సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ మణుగూరు మండలం రాజుపేట, విట్టల్ రావు నగర్, పీకే వన్, బాపనగుంట గ్రామాలు సింగరేణి ఎఫెక్ట్ ఏరియాలోకి వస్తున్నాయని, ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతిరోజూ జరుగుతున్న సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని, గోడలు పగలుతున్నాయని, ఇండ్లపై పడుతున్న ధూళి వల్ల మంచినీరు కూడా కలుషితమవుతుందని వాపోయారు.
వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ, కేవలం 50 మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్ జరుగుతోందని, ఇలా దగ్గరగా బ్లాస్టింగ్ జరగడం వల్ల తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పారు. 1-2 కిలోమీటర్ల దూరంలో బ్లాస్టింగ్ జరిగినా ఇండ్లు ఊగిపోతున్నాయని, తమ గ్రామాల్లో మాత్రం 50 మీటర్లకే బ్లాస్టింగ్ జరగడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ మేరకు, సంబంధిత కలెక్టర్, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ గోడు తీసుకెళ్లి పరిహారం కల్పించాలని, సురక్షిత ప్రాంతాలకు తాము తరలించాలని కోరుతూ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.

ఈ కార్యక్రమంలో సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, గ్రామస్తులైన ఐయితన బోయిన వెంకన్న, బొజ్జ సదానందం, శ్రీకాకుళం వీరమల్లు, రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….