ప్రతి క్షణం
ప్రజల పక్షం

వలస ఆదివాసీ గుత్తిలో పోలీసుల సేవా కార్యక్రమం చిన్నారులకు దుస్తుల పంపిణీ.. విద్యపై అవగాహన పిల్లలను క్రమం తప్పకుండా బడికి పంపించాలి: . అసాంఘిక కార్యకలాపాలకు దూరంగా ఉండాలి: సూచన తల్లిదండ్రుల జ్ఞాపకాలకు సేవా సుమాంజలి. విద్యార్థుల ప్రతిభకు పట్టం.. పాఠశాలలకు అండగా ‘అమ్మనాన్న’ ట్రస్ట్ రూ.20 వేల చొప్పున స్కాలర్‌షిప్‌లు.. పాఠశాలలకు తాగునీటి కోసం ఆర్థిక సాయం. గురువును చంపేంత కసి.. పదో తరగతి వయసులోనే ఎందుకు? రూపారెడ్డి హత్య ఘటనపై సమాజాన్ని ఆలోచింపజేస్తున్న ప్రశ్నలు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ…. బుచ్చయ్య చిత్రపటానికి నివాళులు సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. భక్తులకు తప్పని అవస్థలు తక్షణమే రహదారి నిర్మించాలని జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ డిమాండ్

  నిరుపేదలకు అండగా సమతా ఫౌండేషన్ అనారోగ్య బాధితునికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం

నిరుపేదలకు అండగా సమతా ఫౌండేషన్
అనారోగ్య బాధితునికి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయం
ఆధాబ్ న్యూస్, పెద్దపల్లి :
పెద్దపల్లి జిల్లా, రామగుండం కార్పొరేషన్ మూడో డివిజన్ న్యూ పోరట్పల్లికి చెందిన ఆత్రం ఆంజనేయులు (28) గత రెండు నెలలుగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన ఆయనకు హాస్పటల్‌లో చికిత్స చేయించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుబాటులో లేక, ఇంటి వద్దనే ఉండాల్సిన పరిస్థితి ఎదురైంది. ప్రస్తుతం ఆయన భార్య కూడా నిండు గర్భిణి కావడంతో పరిస్థితి మరింత విషమంగా మారింది.

ఈ విషయం సోయం జనార్ధన్ ద్వారా తెలిసిన సమతా ఫౌండేషన్ నిర్వాహకులు మార్షల్, దుర్గం ప్రమీల నాగేశ్, ఎన్టిపిసి కమిటీ సభ్యులు కలిసి శనివారం ఆంజనేయులను పరామర్శించారు. అనారోగ్య పరిస్థితి వివరాలు అడిగి తెలుసుకున్న వారు, మానవతా దృక్పథంతో స్పందిస్తూ, దాతల సహకారంతో సేకరించిన 11 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఈ సందర్భంగా బాధితుడి కుటుంబ సభ్యులు మరియు సమతా ఫౌండేషన్ సభ్యులు దుర్గం నరసయ్య, ముడిమడుగుల సురేష్, చందనగిరి శివప్రసాద్, జిమ్మిడి శాంతి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

సహాయానికి స్పందించిన ప్రతి దాతకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మరింత మానవతావాదులు ముందుకు వచ్చి ఆంజనేయులుకు ఆర్థిక సహాయం చేయాలని వారు కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….