ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గుండాల మండల కేంద్రంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం

గుండాల, ఆధాబ్ న్యూస్ :
గుండాల మండల కేంద్రంలో ఉన్న ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గర్భిణీ స్త్రీలకు, పిల్ల తల్లులకు పోషక ఆహారం ఎలా ఇవ్వాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ప్రతి ఒక్కరికి తెలియజేయడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. మీరు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతీ ఇంటికీ ఈ సందేశాన్ని అందించాలని అంగన్వాడీ ఉపాధ్యాయులపై బాధ్యత ఉంటుందని” అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం, పాయం వెంకటేశ్వర్లు గర్భిణీ స్త్రీలను  శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో పినపాక నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అంగన్వాడీ ఉపాధ్యాయులు, మండల అధికారులు, మండలం కాంగ్రెస్ పార్టీ నాయకులు, మహిళా నేతలు, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!