యశోదలో అరుదైన చికిత్స . మారేడ్ పల్లి, నవంబర్ 30 అధాబ్ న్యూస్ : దేశంలోనే తొలిసారిగా పల్మనరి త్రోంబెక్టమి చికిత్స ద్వారా ఓ విద్యార్థి ప్రాణాలు కాపాడినట్లు యశోద వైద్యులు తెలిపారు .శుక్రవారం సికింద్రాబాద్ యశోద దవాఖాన ఆవరణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ ఇంట్వేన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ సి. రఘు మాట్లాడుతూ అక్టోబర్ 28న కరీంనగర్ జిల్లాకు చెందిన విద్యార్థి రిషికేశ్ ( 20 )ఛాతి నొప్పి ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో యశోద దావాఖానకి వచ్చాడు .వైద్య పరీక్షలు నిర్వహించగా అతడు పల్మనరి త్రోంబెక్టమి బాధపడుతున్నట్టుగా గుర్తించాం. అత్యాధునిక ఇనారి మెడికల్ డివైజ్ పల్మనరి త్రోంబెక్టమి చికిత్స ద్వారా రక్తనాళాల్లోనే క్లాట్స్ ను తొలగించాము . ప్రస్తుతం రిషికేశ్ ఆరోగ్యంగా ఉన్నాడు . ఈ సమావేశంలో డాక్టర్ హరికిషన్ సీనియర్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ విక్రమ్ ,డాక్టర్ హేమలత తదితరులు పాల్గొన్నారు.









