BIG BREAKING: కవితకు భారీ ఊరట – ఢిల్లీ లిక్కర్ కేసులో క్లీన్ చీట్
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు ఢిల్లీ లిక్కర్ కేసులో భారీ ఊరట లభించింది. ఈ కేసులో కవితపై సీబీఐ నమోదు చేసిన అభియోగాలన్నింటినీ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.
సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జితేందర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. కవితతో పాటు ఈ కేసులో ఉన్న మొత్తం 23 మంది నిందితులపై ఆరోపణలను నిరూపించే తగిన సాక్ష్యాధారాలు లేవని కోర్టు స్పష్టం చేసింది.
దీంతో ఈ కేసులో కవితకు పూర్తి స్థాయి ఉపశమనం లభించినట్లు అయ్యింది. రాజకీయ వర్గాల్లో ఈ తీర్పు చర్చనీయాంశంగా మారింది.
Post Views: 9








