కరకగూడెం, ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు
జాతీయ డెంగ్యూ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరకగూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ రవితేజ ఆధ్వర్యంలో డెంగ్యూపై అవగాహన ర్యాలీ నిర్వహించబడింది. ఈ కార్యక్రమం హెచ్ ఈ ఓ కృష్ణయ్య పర్యవేక్షణలో జరిగింది. వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, ఆరోగ్యశాఖ సిబ్బంది ఇందులో భాగస్వాములయ్యారు.
ర్యాలీలో ప్రజలలో అవగాహన పెంపొందించేందుకు వివిధ ఆరోగ్య నినాదాలు వినిపించాయి:
దోమకాటు – ప్రాణాంతకం
నీటి నిల్వలు – దోమలకు ఆశ్రయాలు
శుభ్రతే రక్షణ – డ్రై డే పాటిద్దాం
ఆరోగ్యమే మహాభాగ్యం
వర్షాకాలం దృష్టిలో ఉంచుకొని మలేరియా, డెంగ్యూ వ్యాధులను నివారించేందుకు ప్రతి ఒక్కరు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రజల ఆరోగ్య సంరక్షణలో ఆరోగ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు.
ఈ
కార్యక్రమంలో పాల్గొన్నవారు:
ఫార్మసిస్ట్ సునీల్, లక్ష్మి, MPHA పద్మ, రుక్మిణి, సుజాత, రమాదేవి, జ్యోతి, MPHA(G) నర్సింహారావు, ఆశా కార్యకర్తలు గణపతమ్మ, మంగవేణి, ఖగదేశ్వరి, జయమ్మ, అసిల సరిత, పుణ్యావతి తదితరులు. అలాగే 108 పైలట్ సాయి కూడా పాల్గొన్నారు.









