విజయ్ దేవరకొండ – రష్మిక మందన్న వివాహం పూర్తి
ఉదయపూర్,ఆధాబ్ న్యూస్: టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ, నటి రష్మిక మందన్న వివాహ బంధంతో అధికారికంగా ఒక్కటయ్యారు. రాజస్థాన్లోని ఉదయపూర్లో ఈరోజు ఉదయం 10:10 గంటలకు హిందూ సాంప్రదాయ ప్రకారం వీరి వివాహం ఘనంగా జరిగింది.
ఇరు కుటుంబాలకు చెందిన అత్యంత సన్నిహిత బంధువులు, స్నేహితుల సమక్షంలో ఈ వేడుక సాదాసీదాగా కానీ సంప్రదాయబద్ధంగా నిర్వహించినట్లు సమాచారం. చాలా కాలంగా ప్రచారంలో ఉన్న ప్రేమ కథకు ఈ రోజు ముగింపు పలుకుతూ పెళ్లి పీటలు ఎక్కారు.
విజయ్–రష్మిక జంటకు అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Post Views: 6








