మేడారం వెళ్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా
ఐదుగురికి తీవ్ర గాయాలు
ములుగు,ఆధాబ్ న్యూస్: మేడారంకు భక్తులతో వెళ్తున్న వాహనం ప్రమాదానికి గురైంది. ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రం సమీపంలో ఈ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల నుంచి మేడారానికి వెళ్తున్న వాహనం, తాడ్వాయి దాటిన సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రమాదకర మలుపు వద్ద అదుపుతప్పి బోల్తా పడింది.
ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటనాస్థలానికి చేరుకున్న స్థానికులు వెంటనే సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స కొనసాగుతోంది.
Post Views: 33









