మేడారం జాతర భక్తులకు సేవా కార్యక్రమం
భద్రాచలం ఆధాబ్ న్యూస్
మేడారం శ్రీ సమ్మక్క–సారలమ్మ జాతరకు వెళ్లే భక్తుల కోసం భద్రాచలం బస్టాండ్లో ఉచితంగా అల్పాహారం, భోజనం పంపిణీ కార్యక్రమాన్ని డాక్టర్ పిన్నింటి రాజశేఖర్ నిర్వహిస్తున్నారు. మున్నూరు కాపు పెద్దలు, భద్రాచలం శ్రీకృష్ణదేవరాయ ట్రస్ట్ చైర్మన్, ప్రముఖ చిన్న పిల్లల వైద్య నిపుణుడిగా ఆయన సేవలు ప్రశంసలు అందుకుంటున్నాయి.
ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మికవేత్త, భద్రాచలం లయన్స్ క్లబ్ చైర్మన్, సామాజిక సేవా కార్యకర్త కమల రాజశేఖర్ కూడా పాల్గొని సేవలు అందించారు. భక్తులు ఈ సేవా కార్యక్రమాన్ని హర్షిస్తూ నిర్వాహకులను అభినందించారు.
Post Views: 42









