ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కరకగూడెం మండలంలో శబరి యాత్రకు 21 మంది అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం వైభవంగా

కరకగూడెం మండలంలో శబరి యాత్రకు 21 మంది అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం వైభవంగా
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండల కేంద్రంలోని లక్ష్మీదేవి గుడి వద్ద శబరి యాత్రకు బయలుదేరుతున్న 21 మంది అయ్యప్ప స్వాముల ఇరుముడి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని గుమ్మడవెల్లి శ్రీను గురుస్వామి, గుమ్మడవెల్లి కృష్ణ గురుస్వామి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

కార్యక్రమంలో నందిగామ ప్రసాద్ గురుస్వామి, కమలాకర్ గురుస్వామి, సోయం గురుస్వామితో పాటు పలువురు అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు. శరణం అయ్యప్ప నినాదాలతో లక్ష్మీదేవి ఆలయం పరిసరాలు గంభీరంగా మారాయి.

సాంప్రదాయరీతిలో పూజలు, ధ్యానం, ఇరుముడి కట్టే కార్యక్రమాలు జరిగిన అనంతరం స్వాములు శబరిమాల యాత్రకు ప్రస్థానమయ్యారు. పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు ఈ విజయవంతమైన కార్యక్రమానికి హాజరై స్వాములకు ఆశీర్వాదాలు అందించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!