ప్రతి క్షణం
ప్రజల పక్షం

  గోల్లగూడెం వద్ద ముమ్మర వాహన తనిఖీలు — ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు

గోల్లగూడెం వద్ద ముమ్మర వాహన తనిఖీలు — ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
మండలంలోని రంగాపురం రహదారి గొల్లగూడెం వద్ద పోలీసులు ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ ప్రత్యేక డ్రైవ్‌లో ప్రతి వాహనాన్ని ఆపి, ప్రయాణికుల వివరాలు, వాహన పత్రాలు సవివరంగా పరిశీలించారు.

అవాంఛనీయ సంఘటనలను నివారించడం, చట్టవ్యవస్థను బలోపేతం చేయడం లక్ష్యంగా చేపట్టిన ఈ తనిఖీల్లో కరకగూడెం ఎస్ఐ పీవీ ఎన్ రావు సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. రాత్రి వేళల్లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, అనుమానాస్పద వాహనాలను ఖచ్చితంగా వెరిఫై చేశారు.

పోలీసుల ఈ చర్య ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తోందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!