ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నూతన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్ల (NAEI) రాష్ట్ర అధ్యక్షులుగా మైపతి వెంకటేశ్వర్లు చిర్రమల్ల గ్రామ ప్రజల్లో హర్షం

నూతన నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్ల (NAEI) రాష్ట్ర అధ్యక్షులుగా మైపతి వెంకటేశ్వర్లు
చిర్రమల్ల గ్రామ ప్రజల్లో హర్షం

కరకగూడెం, ఆధాబ్ న్యూస్:
బాబా సాహెబ్ అంబేద్కర్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్‌ (NAEI) తెలంగాణ రాష్ట్ర కొత్త అధ్యక్షుడిగా మైపతి వెంకటేశ్వర్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జాతీయ అధ్యక్షులు, ఓఎన్జీసీ మాజీ డిప్యూటీ చైర్మన్ ఎన్‌.కె‌. సోనారే అధ్యక్షతన ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు సహా కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

ఏజెన్సీ ప్రాంతమైన కరకగూడెం మండలం చిర్రమల్ల గ్రామానికి చెందిన మైపతి వెంకటేశ్వర్లు నిరుపేద వ్యవసాయ కుటుంబంలో జన్మించి, చదువులో ప్రతిభ కనబరిచి ఉన్నత స్థాయికి చేరుకున్న వ్యక్తిగా అందరిలో ప్రశంసలు పొందుతున్నారు. ప్రస్తుతం ప్రముఖ ఐటీ సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలందిస్తున్నారు.

గ్రామానికి చెందిన వ్యక్తి రాష్ట్ర స్థాయి పదవి దక్కించుకోవడంతో చిర్రమల్ల గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, వెంకటేశ్వర్లకు తమ శుభాకాంక్షలు తెలియజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!