బైక్ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు – వ్యక్తికి తీవ్ర గాయాలు
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం జానంపేట సమీపంలోని వెంకటేశ్వరపురం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. హనుమకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మణుగూరువైపు వస్తుండగా బైక్ను ఢీకొట్టినట్లు సమాచారం.
ఈ ప్రమాదంలో బైక్పై ప్రయాణిస్తున్న పొనుగంటి సమ్మయ్య తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే అతన్ని సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది?
Post Views: 45









