ప్రతి క్షణం
ప్రజల పక్షం

  🩸 కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానం – మానవత్వాన్ని చాటుకున్న దంపతులు

🩸 కుమారుడి జన్మదినం సందర్భంగా రక్తదానం – మానవత్వాన్ని చాటుకున్న దంపతులు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
హైదరాబాద్‌ నుంచి భద్రాచలం వచ్చి మానవత్వాన్ని చాటుకున్న దంపతులు ఆదర్శంగా నిలిచారు. సారపాక పట్టణానికి చెందిన విజయరామరాజు–కళ్యాణి దంపతులు తమ కుమారుడు చాణిక్య జన్మదినం సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేశారు.

మదర్ థెరిస్సా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో భద్రాచలం రెడ్‌క్రాస్ బ్లడ్ బ్యాంక్‌లో ఈ రక్తదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విజయరామరాజు ఓ పాజిటివ్‌ రక్తాన్ని, కళ్యాణి ఏ పాజిటివ్‌ రక్తాన్ని తలసేమియా పిల్లల కోసం దానం చేశారు.

ట్రస్ట్ వ్యవస్థాపకులు కొప్పుల మురళి మాట్లాడుతూ, గత రెండు సంవత్సరాలుగా ఈ దంపతులు తమ కుమారుడి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేస్తూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుత సమాజంలో రక్తదానం చేయాలంటే భయపడే పరిస్థితుల్లో, హైదరాబాద్‌ నుండి భద్రాచలం వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని ఆయన ప్రశంసించారు.

ప్రతి ఒక్కరూ కూడా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని కోరారు. రక్తదానం ద్వారా ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి ప్రాణదానం చేయవచ్చని గుర్తుచేశారు.

ఈ సందర్భంగా ట్రస్ట్ తరఫున విజయరామరాజు–కళ్యాణి దంపతులను శాలువాతో సన్మానించి, స్మారక షీల్డ్‌లను అందజేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!