కొబ్బరి దీపం వెలిగిస్తే శుభఫలితాలు
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
పూజా విధానాల్లో కొబ్బరికాయలో దీపం వెలిగించడం ఆధ్యాత్మికంగా అత్యంత శక్తివంతమైన క్రతువుగా కొనసాగుతోంది. కొబ్బరికాయలో నూనె వేసి దీపం వెలిగించి శివుడి ముందు అర్పిస్తే ఆర్థిక అభివృద్ధి, దారిద్ర్య నాశనం, ఇబ్బందుల నుంచి విముక్తి లభిస్తాయి.
ప్రత్యేకంగా క్రిష్ణ పక్షం మరియు శుక్ల పక్షం అష్టమి రోజుల్లో కాలభైరవునికి కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా —
శని గ్రహ దోషాలు తగ్గిపోతాయి,
ఇత్తిబాధలు తొలగిపోతాయి,
ఇంట్లో శాంతి చేకూరుతుంది,
అని సంప్రదాయంలో భావించబడుతుంది.
కొబ్బరి దీపం వెలిగించడం ద్వారా కుటుంబంలో శ్రేయస్సు స్థిరపడుతుంది. పూజలో విశ్వాసంతో ఈ కార్యక్రమం చేస్తే ఫలితాలు మరింత త్వరగా కనిపిస్తాయని ఆధ్యాత్మిక వర్గాలు పేర్కొంటున్నాయి.
Post Views: 34









