బీర్లు తాగిన ప్రిన్సిపాల్ను మా పాఠశాలకు ఎందుకు పంపారు? — గురుకుల విద్యార్థినుల ఆగ్రహం
నాగర్ కర్నూల్ ,ఆధాబ్ న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి గురుకుల విద్యా వ్యవస్థ క్రమంగా దెబ్బతింటోందని విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేశారు. సూర్యాపేట జిల్లా బాలెం గురుకుల పాఠశాలలో బీర్లు తాగిన ప్రిన్సిపాల్ శైలజను తమ పాఠశాలకు బదిలీ చేయడంపై నాగర్ కర్నూల్ జిల్లా గురుకుల విద్యార్థినులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
వారు మాట్లాడుతూ, “ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే మా గురుకుల పాఠశాల దరిద్రంగా మారింది. చదువులు అధ్వానంగా మారాయి. ఇప్పుడు బీర్లు తాగిన ప్రిన్సిపాల్ను మా మీద పెట్టారు” అని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యార్థినుల ప్రకారం, శైలజ మేడంకు పై అధికారుల మద్దతు ఉండటంతో ఎవరు ఏం చెప్పలేకపోతున్నారని, ఆమె పరీక్ష ఫీజుల పేరుతో విద్యార్థుల నుండి రూ.10 వేలు వసూలు చేస్తోందని, కిచెన్లోని సామాన్లు కూడా తీసుకుపోతుందని ఆరోపించారు.
“నన్నెవరూ ఏం చేయలేరు” అంటూ ప్రిన్సిపాల్ ప్రతాపం చూపిస్తోందని విద్యార్థినులు వెల్లడించారు. ఆమెను వెంటనే సస్పెండ్ చేయాలని, గురుకులల్లో పారదర్శకత తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు.
ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు కోరారు.









