శ్రద్ధాంజలి ఘటించిన సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం తాటిగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని ఇప్పచెట్టు గుంపు గ్రామానికి చెందిన దుర్గం సమ్మక్క (110) మరణించగా, వారి పార్థివ దేహానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పూలమాలలు అర్పించి నివాళులర్పించారు.
తరువాత కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు గాంధర్ల రామనాథం, జాడి శ్రీను, దుర్గం కన్నయ్య, పార్టీ కార్యకర్తలు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 38









