ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఫెడరేషన్ & జూనియర్ జాతీయ అథ్లెటిక్స్‌లో రెండు బంగారు పథకాలు అభినందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

మణుగూరు, ఆధాబ్ న్యూస్: 24 అక్టోబర్ 2025

ఫెడరేషన్ & జూనియర్ జాతీయ అథ్లెటిక్స్‌లో రెండు బంగారు పథకాలు
అభినందించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

ఉత్తరప్రదేశ్‌లో జరిగిన 23వ ఫెడరేషన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025లో బంగారు పథకం, అలాగే ఒడిశా భువనేశ్వర్‌లో జరిగిన 40వ జూనియర్ జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో మరో బంగారు పథకం సాధించి తెలంగాణకు గర్వకారణంగా నిలిచిన కరకగూడెం మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన అథ్లెట్ తోలేం శ్రీతేజను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఘనంగా సన్మానించారు.

శుక్రవారం మణుగూరు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ—
“శ్రీతేజ దేశంలోని పలు ప్రతిష్టాత్మక అథ్లెటిక్స్ పోటీలలో ముందంజలో నిలుస్తూ రాష్ట్రానికి పేరు, ప్రతిష్టలను తీసుకొస్తోంది. రాబోయే రోజుల్లో అంతర్జాతీయస్థాయిలోనూ మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నాం” అని తెలిపారు.
అటు క్రీడల వల్ల విద్యార్థుల్లో మానసిక, శారీరక అభివృద్ధి జరుగుతుందని నాయకులు తెలిపారు.

గతంలో 19వ నేషనల్ యూత్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024 బిలాస్పూర్‌లో కాంస్యం, 35వ సౌత్ జోన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ గుంటూరులో బంగారం, 39వ జూనియర్ నేషనల్స్ భువనేశ్వర్‌లో రజతం సాధించి శ్రీతేజ క్రీడారంగంలో నిలువెత్తు ప్రతిభను నిరూపించిన విషయం తెలిసిందే.

కార్యక్రమంలో కరకగూడెం మండల అధ్యక్షులు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్, మండల నాయకులు, ఇతరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!