స్వప్న పార్థివ దేహానికి రేగా కాంతారావు నివాళులు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండలంలోని రఘునాథపాలెం గ్రామానికి చెందిన పోలెబోయిన జయబాబు సతీమణి స్వప్న (FBO) అనారోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు గురువారం ఆమె నివాసానికి చేరుకుని పార్థివ దేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
అనంతరం రేగా కాంతారావు జయబాబు కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. స్వప్న ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రావుల సోమయ్య, అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి, కొమరం రాంబాబు, పోగు వెంకటేశ్వర్లు, గుడ్ల రంజిత్ కుమార్, పాయం నరసింహారావు, సుతారి నాగేష్, ప్రభాకర్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 79









