ప్రతి క్షణం
ప్రజల పక్షం

  స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా?

స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా?
23న క్యాబినెట్ సమావేశం రోజున తుది నిర్ణయం
హైదరాబాద్, అక్టోబర్ 21 (ఆధాబ్ న్యూస్):

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలవుతాయా అనే ప్రశ్నపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. గత ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇవ్వడం, అనంతరం సుప్రీంకోర్టులో పిటిషన్ కొట్టివేయడంతో ఆ నిర్ణయం నిలిచిపోయింది.

ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందా, లేక పాత రిజర్వేషన్ విధానాన్నే కొనసాగిస్తుందా అనే అంశంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ మొదలైంది.

ఈ నెల 23న జరగనున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఈ విషయంపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఈ నిర్ణయం బీసీ వర్గాలకే కాకుండా మొత్తం రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

బీసీ రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలు, రాజకీయ పక్షాలు, సామాజిక సంస్థలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!