ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఉప్పాడలో మత్స్యకారులతో పవన్ కల్యాణ్ భేటీ — హామీల అమలుకు స్పష్టమైన ప్రణాళిక

ఉప్పాడలో మత్స్యకారులతో పవన్ కల్యాణ్ భేటీ — హామీల అమలుకు స్పష్టమైన ప్రణాళిక

ఉప్పాడ, ఆధాబ్ న్యూస్:
పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడలో మత్స్యకార సోదరులు, ఆడపడుచులను కలుసుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు — “ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కటినీ మర్చిపోలేదు. కూటమి ప్రభుత్వం తరపున మత్స్యకారులకు అన్ని విధాలుగా అండగా ఉంటాం” అని తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన పలు ముఖ్య నిర్ణయాలను ప్రకటించారు.
చేపల వేటలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ఆర్థిక సహాయం:
కాకినాడ జిల్లాకు చెందిన ప్రమాదవశాత్తూ మృతి చెందిన 18 మంది మత్స్యకారుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 5 లక్షల చొప్పున మొత్తం రూ. 90 లక్షల బీమా చెక్కులను అందజేశారు.
ఉప్పాడ తీర పరిరక్షణకు భారీ ప్రణాళిక:
తీర ప్రాంత ప్రజలను సముద్ర ప్రభావం నుండి రక్షించేందుకు రూ. 323 కోట్ల వ్యయంతో రీటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేయనున్నట్లు హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కేంద్ర ప్రభుత్వ సహకారంతో అమలు చేయనున్నట్లు తెలిపారు.
ఫిషింగ్ హార్బర్ లోపాల సవరణ:
ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ నిర్మాణంలో ఉన్న డిజైన్ లోపాలను గుర్తించామని, సైసెఫ్ (CICEF) సంస్థ శాస్త్రవేత్తలు ఇటీవల అధ్యయనం చేశారని చెప్పారు. “బోట్ల నష్టం నివారించేందుకు, APSDMA సహకారంతో రూ. 98 కోట్ల వ్యయంతో సవరణ పనులు త్వరలో ప్రారంభిస్తాం” అని తెలిపారు.
100 రోజుల్లో స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక:
“మత్స్యకారులతో నిర్వహించిన ‘మాట–మంతి’ కార్యక్రమంలో తెలిసిన సమస్యలను పరిష్కరించేందుకు 100 రోజులలోపు స్పష్టమైన ప్రణాళిక సిద్ధం చేసి అమలు చేస్తాం” అని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
తీర కాలుష్యంపై ప్రత్యేక దృష్టి:
తీర ప్రాంత పారిశ్రామిక కాలుష్యంపై పొల్యూషన్ ఆడిట్ నిర్వహించాలని పీసీబీ అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. “వారం రోజుల్లో నివేదిక అందుతుంది. మరో 3–4 రోజుల్లో తీర ప్రాంతాలను స్వయంగా పర్యటించి కాలుష్య తీవ్రత పరిశీలిస్తాను” అని ఆయన అన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!