కరకగూడెం, అక్టోబర్ 2 (ఆధాబ్ న్యూస్):
మహాత్మా గాంధీ జయంతిని కరకగూడెం మండలం సీతరాంపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్, తెలంగాణ గాంధీ స్మారక నిధి రాష్ట్ర బోర్డ్ సభ్యుడు చందా లింగయ్య దొర గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా టీపీసీసీ సభ్యులు డాక్టర్ చందా సంతోష్ కుమార్, మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ కూడా పాల్గొని బాపూజీకి నివాళులు అర్పించారు.
కార్యక్రమాన్ని గాంధీ స్మారక నిధి కరకగూడెం మేనేజర్ & మండల కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు నాగబండి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ వేడుకలో గ్రామ పెద్దలు కొంపెల్లి రామలింగం, బైరిశెట్టి చిరంజీవి, చిట్టి ప్రసాద్, గొగ్గల రవి, చందా రత్నమ్మ, చందా నాగేశ్వరరావు, గొగ్గలి కృష్ణ, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.









