వినాయక చందా ఇవ్వలేదని నాలుగు కుటుంబాలకు కుల బహిష్కరణ
జగిత్యాల రూరల్ ఆధాబ్,న్యూస్: మండలం కల్లెడ గ్రామంలో ఒక వివాదాస్పద సంఘటన వెలుగుచూసింది. వినాయకుడి దగ్గర కొబ్బరికాయ కొట్టేందుకు వెళ్ళిన నాలుగు కుటుంబాలను కుల పెద్దలు కుల బహిష్కరణకు గురి చేశారు.
కుటుంబాలకు ₹1,116 చందా ఇవ్వాలని కుల పెద్దలు డిమాండ్ చేసినట్లు సమాచారం. చందా ఇవ్వకపోవడంతో వారితో ఎవరూ మాట్లాడకూడదని, డప్పు చప్పుల్లతో గ్రామంలో దండోర పెట్టించారు.
అంతేకాకుండా ఎవరు ఆ కుటుంబాలతో మాట్లాడితే ₹25 వేల జరిమానా విధిస్తామని కుల పెద్దలు హెచ్చరించారు. దీంతో బాధిత కుటుంబాలు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు.
Post Views: 70









