కేసుపాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో టీ-షర్టుల పంపిణీ
బూర్గంపాడు,ఆధాబ్ న్యూస్:
మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో ఏబీఆర్ యూత్ ఆధ్వర్యంలో జరుగుతున్న వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కేసుపాక ఫౌండేషన్ ఆధ్వర్యంలో రూ.10,000 విలువైన టీ-షర్టులు పంపిణీ చేశారు.
శుక్రవారం జరిగిన వినాయక నవరాత్రి ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో ఫౌండేషన్ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ కేసుపాక నరసింహారావు పాల్గొని టీ-షర్టులను కమిటీ సభ్యులు, కాలనీవాసులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మందా నాగరాజు, కేసుపాక ఫౌండేషన్ సభ్యులు కేసుపాక మహేష్, కేసుపాక పుల్లయ్య, కేసుపాక భాస్కర్, కేసుపాక రాజేష్, కేసుపాక ప్రసాద్, కేసుపాక రఘురామ్, అలవాల దుర్గాప్రసాద్, నందిపాటి వెంకటేశ్వర్లు, రేవంత్ సాయి, కేసుపాక సాయి సాగర్, నాగేంద్ర సాయి, కేసుపాక వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 100









