నల్లగొండలో మత్స్యశాఖ అధికారి ఏసీబీకి పట్టుబాటు
నల్లగొండ,ఆధాబ్ న్యూస్:
నల్లగొండ జిల్లాలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఓ అధికారి చేతికి బిగ్గువేశారు. మత్స్య సహకార సంఘ సభ్యుల నుండి రూ.20,000 లంచం స్వీకరిస్తూ మత్స్యశాఖ జిల్లా అధికారి చరితా రెడ్డి ఏసీబీ బృందానికి చిక్కారు.
సభ్యులకు సంబంధించిన అనుమతులు, పత్రాల పరిశీలనలో సౌకర్యం కల్పించడానికి లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా ఉచ్చుపన్నిన ఏసీబీ, ఆమె కార్యాలయంలోనే రంగే చేతికొచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం చరితా రెడ్డి పై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఏసీబీ వర్గాలు వెల్లడించాయి.
Post Views: 74









