ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వలస ఆదివాసి కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు – అధికారులకు సిపిఎం ధన్యవాదాలు

వలస ఆదివాసి కాలనీలో వీధిలైట్లు ఏర్పాటు – అధికారులకు సిపిఎం ధన్యవాదాలు
కరకగూడెం,ఆధాబ్ న్యూస్:
కరకగూడెం మండలంలోని రేగళ్ల గ్రామపంచాయతీ వలస ఆదివాసి కాలనీలో నాలుగైదు నెలలుగా వీధి లైట్లు వెలగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ సమస్యను సిపిఎం పార్టీ గుర్తించి పంచాయతీ కార్యదర్శి, మండల అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. స్పందించిన అధికారులు తక్షణమే కొత్త వీధిలైట్లు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా అధికారులకు సిపిఎం పార్టీ మండల కమిటీ, రేగళ్ల గ్రామ శాఖ తరఫున ధన్యవాదాలు తెలిపారు. పంచాయతీకి నిధుల కొరత ఉన్నా, ప్రజల సమస్యల పరిష్కారంలో అధికారులు ముందడుగు వేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో మౌలిక సదుపాయాల కొరత, పారిశుధ్యం వంటి సమస్యల పరిష్కారంలో కూడా అధికారులు చొరవ చూపాలని సిపిఎం పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో రైగళ్ల పార్టీ శాఖ కార్యదర్శి పదం బాబురావు, కనితి రాము, తాటి దేవయ్య, లక్ష్మయ్య, మడకం చందు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!