ప్రతి క్షణం
ప్రజల పక్షం

  భద్రాద్రి జిల్లా SP ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్ట్ దళ సభ్యులు

భద్రాద్రి జిల్లా SP ఎదుట లొంగిపోయిన 8 మంది మావోయిస్ట్ దళ సభ్యులు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు ఎనిమిది మంది నిషేధిత CPI మావోయిస్ట్ దళ సభ్యులు స్వచ్ఛందంగా లొంగిపోయారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ IPS ఎదుట జరిగిన ఈ లొంగుబాటు కార్యక్రమంలో ఏడూళ్ళ బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. గత కొంతకాలంగా అరణ్యప్రాంతాల్లో చురుకుగా కార్యకలాపాలు నిర్వహించిన ఈ సభ్యులు, ప్రభుత్వ పునరావాస పథకాలు మరియు సాధారణ జీవనానికి తిరిగి రావాలనే ఉద్దేశంతో లొంగుబాటు చేసినట్లు సమాచారం. ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ, లొంగుబాటు చేసిన వారికి ప్రభుత్వం అందించే అన్ని సదుపాయాలు కల్పించబడతాయని, మిగిలిన మావోయిస్ట్ దళ సభ్యులు కూడా శాంతియుత జీవనాన్ని ఎంచుకోవాలని పిలుపునిచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!