రైతు నుంచి రూ.50 వేల లంచం – మరో లక్ష డిమాండ్ తహసీల్దార్, సర్వేయర్ ఏసీబీ వలలో!
ఆధాబ్ న్యూస్, రంగారెడ్డి:
రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి బహిర్గతమైంది.
రైతు పాసు బుక్కులో జెండర్ కరెక్షన్ కోసం తహసీల్దార్ సీహెచ్. లలిత, సర్వేయర్ రవి లంచం డిమాండ్ చేసిన ఘటనలో ఏసీబీ అధికారులు మంగళవారం దాడులు జరిపారు.
గతంలోనే రూ.50,000 లంచం తీసుకున్న అధికారులు, మరో లక్ష రూపాయలు డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీని ఆశ్రయించాడు.
లంచం డిమాండ్ నిర్ధారణ కావడంతో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Post Views: 37









