మణుగూరు రోడ్డుపై రోడ్డు ప్రమాదం – ముగ్గురికి తీవ్ర గాయాలు
పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం నుంచి మణుగూరు వెళ్లే ప్రధాన రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. సీతరంపురం వద్ద బర్రె అకస్మాత్తుగా రోడ్డు దాటడంతో ముందు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి మరో వాహనం ఢీకొట్టింది. ఢీ కొట్టిన ప్రభావంతో ఆటో బోల్తా కొట్టింది.
ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు సమాచారం ఇచ్చి 108 అంబులెన్స్ ద్వారా గాయపడిన వారిని మణుగూరు ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
Post Views: 33









