ప్రతి క్షణం
ప్రజల పక్షం

  73 ఏళ్ల వయసులో జాతీయ స్థాయిలో నాలుగు బంగారు పతకాలు – భద్రాద్రి జిల్లా ఎస్పీ అభినందనలు

భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు డివి శంకర్రావు పవర్ లిఫ్టింగ్ ఇండియా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశారు. కేరళ రాష్ట్రంలో ఆగస్టు 2 నుండి 7 వరకు జరిగిన జాతీయ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఆయన నాలుగు బంగారు పతకాలు సాధించారు.

ఈ విజయంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ప్రత్యేకంగా శంకర్రావును అభినందించారు. ఆయన మాట్లాడుతూ – “73 ఏళ్ల వయసులో, హార్ట్ బైపాస్ సర్జరీ అనంతరం కేవలం ఆరు నెలల్లోనే జిల్లా, రాష్ట్ర స్థాయిలను అధిగమించి జాతీయ స్థాయిలో విజయం సాధించడం విశేషం. ఇది వయసు, ఆరోగ్య సమస్యలు మనసులో ఉన్న సంకల్పానికి అడ్డుకాదని నిరూపించింది” అని పేర్కొన్నారు.

జిమ్ కోచ్ జివి రామిరెడ్డి శిక్షణలో సాధించిన ఈ విజయం అన్ని వయసుల వారికి స్ఫూర్తినిచ్చేలా ఉందని ఎస్పీ తెలిపారు. “సంకల్పం అడ్డంకులను మైలురాళ్లుగా మార్చుతుంది. వృద్ధాప్యాన్ని పరిమితి కాకుండా కొత్త అవకాశాలుగా చూడాలి” అని సందేశం ఇచ్చారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!