ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు రక్తదాన శిబిరం – పండ్ల పంపిణీ – పాఠశాల విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు

అభిమానుల ఆధ్వర్యంలో ఘనంగా మహేష్ బాబు జన్మదిన వేడుకలు

రక్తదాన శిబిరం – పండ్ల పంపిణీ – పాఠశాల విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
సూపర్ స్టార్ మహేష్ బాబు యాభై యవ పుట్టినరోజు సందర్భంగా, మణుగూరు మహేష్ బాబు అభిమానుల సంఘం శనివారం పలు సామాజిక సేవా కార్యక్రమాలను నిర్వహించింది.

మొదటగా, యువకులు ప్రభుత్వ 100 పడకల ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఇటీవల ప్రారంభించిన బ్లడ్ బ్యాంక్‌లో రక్తదానం చేశారు. అనంతరం, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు పండ్ల పంపిణీ నిర్వహించారు.

తదుపరి, సీ-టైప్ ఎదురుగా ఉన్న సంతోష్ నగర్లోని శ్రీ విద్యాభ్యాస పాఠశాల విద్యార్థులకు సహా పంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.

అతిథుల అభినందనలు

ఈ కార్యక్రమాలలో పాల్గొన్న అతిథులు మాట్లాడుతూ, “సినీ నటుల అభిమానులు తమ హీరో పట్ల ప్రేమను మాత్రమే కాకుండా, పుట్టినరోజు సందర్భాలలో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల మనసులు గెలుచుకోవడం ప్రశంసనీయం” అన్నారు. రక్తదానం అంటే ప్రాణదానం అని, ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.

పాల్గొన్నవారు

ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా వెంకట్ రెడ్డి మెన్స్ అధినేత వెంకట నాగేశ్వరరావు, బాలాజీ స్వీట్స్ అధినేత రంగారావు, ఎస్.వి. నాయుడు, కుడిపూడి శ్రీనివాసరావు, జానపాటి వేణు, మహేష్ బాబు అభిమానుల గౌరవ అధ్యక్షుడు గోపి, అధ్యక్షుడు ప్రదీప్, ఉపాధ్యక్షులు సర్వేష్, కాజా, వినయ్, సురేష్, ఆదిత్య, రవి, నిశాంత్, పగిడిపల్లి వెంకటేష్, వర్షిత్, సాత్విక్, పవన్, ప్రవీణ్, ముత్యాలు, రవీందర్, సాయి తదితరులు పాల్గొన్నారు.

అంతట అనంతరం సూపర్ స్టార్ మహేష్ బాబుకు అభిమానులు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!