ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఉద్వేగంతో సాగిన కామ్రేడ్ అయోధ్య అంతిమయాత్ర

ఉద్వేగంతో సాగిన కామ్రేడ్ అయోధ్య అంతిమయాత్ర
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
సీపీఐ రాష్ట్ర నాయకుడు కామ్రేడ్ అయోధ్య అకాల మరణం పట్టణంలో తీవ్ర విషాదాన్ని నింపింది. పార్టీ శ్రేణులు, ప్రజలు, నాయకులు వందలాది మంది కన్నీళ్లు ఆపుకోలేక అంతిమయాత్రలో పాల్గొన్నారు. బాలసంఘాల మోతలతో నగరం మార్మోగింది. ఆకాశమే దుఃఖంతో అరుణవర్ణంగా మారినట్టు అనిపించింది.

ఆయన భౌతికకాయాన్ని వందలాది వాహనాలతో ర్యాలీగా తీసుకెళ్లారు. ప్రజల సందర్శనార్థం అంబేద్కర్ కుడాలీలో ఉంచగా, విద్యార్థులు, యువకులు, సామాన్య ప్రజలు భారీగా చేరుకొని కన్నీటి నివాళులు అర్పించారు.

ఈ అంతిమయాత్రలో సీపీఐ పార్టీ కార్యకర్తలతోపాటు, వివిధ పార్టీల నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. మార్గమధ్యంలో భారీ ట్రాఫిక్ ఏర్పడడంతో సీఐ నాగబాబు సిబ్బందితో కలిసి ట్రాఫిక్ క్లియర్ చేశారు.

“లాల్ సలాం కామ్రేడ్ అయోధ్య”, “అయోధ్య అమర్ రహే”, “రెడ్ సల్యూట్ కామ్రేడ్” అంటూ నినాదాలు మార్మోగుతున్నాయి. ఎంతో మంది అభిమానులు ఆయనకు చివరి వీడ్కోలు చెప్పడానికి భారీగా తరలివచ్చారు. పార్టీ పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగా కూడా అయోధ్య మంచి పేరు తెచ్చుకున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!