కొత్త రూపంలో అంబులెన్సులు రోడ్డుపైకి!
ఆంధ్రప్రదేశ్లో సంకల్పంగా సంజీవని సేవలు..
ఆంధ్రప్రదేశ్, ఆధాబ్ న్యూస్:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంబులెన్సులు త్వరలోనే నూతన రూపంలో ప్రజలకు సేవలందించనున్నాయి. ఇప్పటికే నీలం రంగులో దర్శనమిచ్చే వైకాపా ప్రభుత్వ కాలంనాటి అంబులెన్సుల స్థానంలో, ఇప్పుడు తెలుపు రంగు ఆధారంగా ఎరుపు, పసుపు రంగుల కాంబినేషన్తో ముస్తాబైన అత్యాధునిక అంబులెన్సులు రోడ్డుపైకి రానున్నాయి.
అత్యాధునిక సాంకేతిక పరికరాలతో, అత్యవసర పరిస్థితులకోసం అవసరమైన అన్ని సదుపాయాలతో ఈ వాహనాలను ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు రిఫ్లెక్టివ్ టేపులు కూడా అమర్చబడ్డాయి.
ఈ అంబులెన్సులు ‘సంజీవని’ పేరుతో ప్రజలకు అందుబాటులోకి రాబోతున్నాయి. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం మల్లవల్లి పారిశ్రామికవాడలోని కుశలవ్ కోచ్ ఫ్యాక్టరీలో ఈ అంబులెన్సుల తయారీ వేగంగా కొనసాగుతోంది.
వాహనాలపై ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం నారా చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ చిత్రాలు ముద్రించబడ్డాయి.
ఇది కూటమి ప్రభుత్వం వైపు నుండి ప్రజలకు అందించే అత్యవసర వైద్య సేవల్లో మరో కీలక ముందడుగు కానుంది.









