ప్రతి క్షణం
ప్రజల పక్షం

  వరద ప్రభావితులు పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలి – తాసిల్దార్ అద్దంకి నరేష్ విజ్ఞప్తి

వరద ప్రభావితులు పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలి – తాసిల్దార్ అద్దంకి నరేష్ విజ్ఞప్తి

మణుగూరు,ఆధాబ్ న్యూస్:
తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో వరద ముప్పు ఉన్న ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు తక్షణమే పునరావాస కేంద్రాలకు తరలివచ్చాలని తాసిల్దార్ అద్దంకి నరేష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అర్ధరాత్రి వేళలకైనా తెగించి డ్యూటీలో ఉన్న అధికారుల కృషి ప్రశంసనీయమని ప్రజలు పేర్కొంటున్నారు. మణుగూరు బస్ డిపో వెనుక ప్రాంతంలోని ఎస్సీ హాస్టల్ పరిసరాలను తాసిల్దార్ స్వయంగా పరిశీలించారు.

విద్యార్థుల తరలింపు:
ప్రాంతంలో వరద భయంతో ఉన్న హాస్టల్ విద్యార్థులను స్థానిక సీఐ నాగబాబు, ఎస్సై రంజిత్ సహకారంతో పునరావాస కేంద్రాలకు సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం ప్రజల ప్రాణాలు, ఆస్తులకు ప్రమాదం జరగకుండా ఉండేందుకు అధికారులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజలు అధికారులకు సహకరించాలని, అవసరమైన వస్తువులు వెంట తీసుకుని తాత్కాలిక పునరావాస కేంద్రాలకు రావాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!