అరుణాచలం గిరి ప్రదక్షణకు మణుగూరు నుండి సూపర్ లగ్జరీ బస్సు – డిపో మేనేజర్ కె. శ్యాంసుందర్
మణుగూరు, ఆధాబ్ న్యూస్:
భక్తుల కోసం ప్రత్యేక సౌకర్యంగా మణుగూరు ఆర్టీసీ డిపో నుండి సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటుచేసినట్టు డిపో మేనేజర్ శ్రీ కె. శ్యాంసుందర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ యాత్ర 8-7-2025 సాయంత్రం 6 గంటలకు మణుగూరునుండి బయలుదేరి, భద్రాచలం, కొత్తగూడెం మార్గంగా కానిపాకం శ్రీ విఘ్నేశ్వర స్వామి దర్శనం అనంతరం శ్రీ పురం గోల్డెన్ టెంపుల్ దర్శనం చేస్తుంది. అనంతరం గురుపౌర్ణమి నాడు 10-7-2025 న తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వర స్వామిని దర్శించుకొని తిరిగి మణుగూరు చేరుకుంటుంది.
ఈ పుణ్యయాత్ర టూర్లో పెద్దలకు రూ.5500, పిల్లలకు రూ.2750 మాత్రమేగా టికెట్ ధరగా నిర్ణయించబడినది. సీట్లు పరిమితంగా ఉన్నాయి కాబట్టి భక్తులు ముందస్తుగా రిజర్వేషన్ చేసుకోవాలని సూచిస్తున్నారు.
వివరాల కోసం సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు:
📞 99592 25963
📞 73828 58121
📞 63053 35304
ఆన్లైన్లో టిక్కెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. రిజర్వేషన్ నెంబర్: 55444
ఈ సదవకాశాన్ని మణుగూరు మరియు పరిసర ప్రాంత భక్తులు వినియోగించుకోవాలని డిపో అధికారులు కోరుతున్నారు.









