చంద్రుగొండ తిప్పనపల్లిలో 130 ఇందిరమ్మ ఇండ్లకు శంకుస్థాపన
అంతర్గత సీసీ రోడ్ల నిర్మాణానికి రూ. కోటి 70 లక్షలు వ్యయం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: చంద్రుగొండ మండలం తిప్పనపల్లి గ్రామంలో 130 ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసిన సందర్భంగా నిర్మాణ పనులకు శంకుస్థాపన జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామ సహాయం రఘురాంరెడ్డి, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నునావత్ పార్వతి w/o నాగేశ్వరరావుకు మంజూరైన ఇండిరమ్మ ఇంటి నిర్మాణ పనులకు ప్రత్యేకంగా శంకుస్థాపన చేశారు. అదేవిధంగా తిప్పనపల్లి గ్రామంలో రూ. 1.70 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అంతర్గత సీసీ రోడ్లకు కూడా శంకుస్థాపన జరిగింది.
ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, గ్రామస్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.









