లబ్దిదారునికి CMRF చెక్కును అందజేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.
మణుగూరు,ఆధాబ్ న్యూస్:
పినపాక నియోజకవర్గ శాసన సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు మణుగూరు మండలంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో, పినపాక మండలం దుగినేపల్లి గ్రామానికి చెందిన అల్లి నరేష్ కు ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) నుండి మంజూరైన చెక్కును అందజేశారు.
ఈ కార్యక్రమం మణుగూరు మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో జరిగింది. లబ్దిదారుని వైద్య ఖర్చుల నిమిత్తంగా ప్రభుత్వం నుండి మంజూరైన ఆర్థిక సాయాన్ని చెక్కు రూపంలో అందజేస్తూ, ప్రభుత్వ ప్రజానంక్షేమ విధానాలను ప్రజలకు చేరవేయడమే తన ప్రధాన లక్ష్యమని పాయం వెంకటేశ్వర్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
పదవిలోకి వచ్చిన తరువాత నుంచి పాయం వెంకటేశ్వర్లు అభివృద్ధి పనులకు పాటు ప్రజలకు నేరుగా ఉపయోగపడే పథకాల అమలులో కూడా చురుకుగా ఉన్నారు.









