ప్రతి క్షణం
ప్రజల పక్షం

  కోట్ల మార్క్ దాటిన లబ్ధిదారులు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

3 కోట్ల మార్క్ దాటిన లబ్ధిదారులు రేషన్ కార్డుల పంపిణీకి ప్రభుత్వం సిద్ధం
హైద్రాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 3 కోట్లను అధిగమించింది. ఇది రాష్ట్రంలోని ఆహార భద్రత పథకానికి మరింత బలాన్నిచ్చే విషయం అని అధికారులు తెలిపారు.

ఇకపోతే, ప్రభుత్వం నాలుగు విడతల్లో 2.03 లక్షల కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని నిర్ణయించింది. త్వరలో ఈ కొత్త కార్డులను మంత్రులు మరియు ఎమ్మెల్యేల ద్వారా లబ్ధిదారులకు పంపిణీ చేయాలని యోచనలో ఉంది.

ఈ చర్యల ద్వారా రాష్ట్రంలోని పేద ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు మరింత సులభంగా అందుబాటులోకి రానుండగా, ఆహార భద్రత పథకం కింద మరిన్ని కుటుంబాలు లబ్ధి పొందనున్నాయి.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!