వెదురు బొంగులు, ఇనుప తుక్కు వేలం
జూన్ 10న భద్రాచలం ITDA ఆధ్వర్యంలో నిర్వహణ
భద్రాచలం, ఆధాబ్ న్యూస్:
భద్రాచలం సమీకృత గిరిజన అభివృద్ధి సంస్థ (ITDA) పరిధిలోని HNTC నర్సరీ, గరిమెళ్లపాడు, ప్రశాంత్నగర్ గ్రామపంచాయతీ, చుంచుపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్న వెదురు బొంగులు (సుమారు 98 పొదలు) మరియు పాత ఇనుప తుక్కు (సుమారు 500 కేజీలు)ను వేలం ద్వారా అమ్మకానికి ఉంచనున్నట్లు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ తెలిపారు.
వేలంలో పాల్గొనదలచిన ఆసక్తి గల వ్యక్తులు రూ.3000 ధారావతు సొమ్ము చెల్లించి జూన్ 10న ఉదయం 10:30 గంటలకు HNTC నర్సరీ, గరిమెళ్లపాడులో జరిగే వేలం పాటకు హాజరుకావలెనని ఆయన కోరారు. అవసరమైతే ఈ వేలాన్ని రద్దు చేయడానికి లేదా తిరిగి ప్రారంభించడానికి పూర్తి అధికారం ప్రాజెక్టు అధికారికి ఉందని ఆయన స్పష్టం చేశారు.
ఈ మేరకు అదనపు పౌర సంబంధాల అధికారి కార్యాలయం, భద్రాచలం విడుదల చేసిన ప్రకటనలో వివరించారు









