ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నూతన సీఐ నాగబాబు ని కలిసిన నేతాజీ వాకర్స్ క్లబ్ సభ్యులు

నూతన సీఐ నాగబాబు ని కలిసిన నేతాజీ వాకర్స్ క్లబ్ సభ్యులు

మణుగూరు,ఆధాబ్ న్యూస్: మణుగూరు పోలీస్ స్టేషన్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన నాగబాబు నేతాజీ వాకర్స్ క్లబ్ కమిటీ సభ్యులు మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి, సాలువ కప్పి, నేతాజీ చిత్రపటంతో కూడిన మెమెంటోను బహుకరించారు.

ఈ సందర్భంగా సీఐ నాగబాబు మాట్లాడుతూ, మణుగూరులో నేతాజీ వాకర్స్ క్లబ్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలు ప్రశంసనీయం అని తెలిపారు. నేతాజీ గ్రౌండ్‌లో ప్రహరీ గోడ, ఓపెన్ జిమ్ వంటి మౌలిక సదుపాయాల కోసం క్లబ్ చేస్తున్న కృషిని ఆయన అభినందించారు. పోలీస్ విభాగం తరఫున క్లబ్ చేపడుతున్న మంచి కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు సామ శ్రీనివాస రెడ్డి, కార్యదర్శి రావులపల్లి రామమూర్తి, వైస్ ప్రెసిడెంట్ జొన్నలగడ్డ వెంకటేశ్వరరావు, కోశాధికారి వడ్డాణం రమేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ దేశబోయిన తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!