నేటి నుంచి రాష్ట్రంలో మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ ప్రారంభం
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రంలో నేటి నుంచి ఈ నెల 30 వరకు మూడు నెలల రేషన్ బియ్యం పంపిణీ చేపట్టనున్నారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు లబ్ధిదారులకు ఒకేసారి మూడు నెలలకు సంబంధించిన బియ్యాన్ని అందించనున్నారు.
వర్షాలు, వరదల ప్రమాదం దృష్ట్యా ముందస్తుగా రేషన్ సరఫరా చేయాలని కేంద్రం సూచించిందని అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ దుకాణాలు ఈ నెలలో అన్ని రోజులు తెరిచి ఉంచనున్నట్లు సమాచారం.
లబ్ధిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, తమ రేషన్ కార్డు, ఆధార్ కార్డు వంటి అవసరమైన పత్రాలతో సమీప రేషన్ దుకాణానికి వెళ్లి బియ్యం అందుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.
📌 ముఖ్యాంశాలు:
ఈ నెల 1 నుండి 30 వరకు రేషన్ పంపిణీ
మూడు నెలల బియ్యం ఒకేసారి
రేషన్ షాపులు ప్రతిరోజూ తెరిచి ఉంటాయి
వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు పంపిణీ









