భద్రాద్రి జిల్లాలో కరోనా వ్యాప్తి.. కేటీపీఎస్ ఉద్యోగికి కరోనా పాజిటివ్
పాల్వంచ , ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరోసారి కరోనా వైరస్ భయం కలుగజేస్తోంది. తాజాగా కేటీపీఎస్లో పనిచేస్తున్న ఓ ఉద్యోగికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. దీంతో ఆ ప్రాంతంలో అప్రమత్తత పెరిగింది.
అధికారుల ప్రకారం, బాధితుడు ఇటీవలే అనారోగ్యానికి గురై పరీక్షలు చేయించుకోగా, కరోనా పాజిటివ్గా తేలింది. అతనికి చికిత్స అందిస్తున్నారు. ఉద్యోగి సంబంధాలలో ఉన్న వారిని గుర్తించి పరీక్షలు చేస్తున్నారు.
సామాజిక దూరం పాటించాలి, మాస్కులు తప్పనిసరిగా ధరించాలి, అవసరం లేని వేళ బయటకు రావద్దని అధికారులు సూచిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వ సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.
Post Views: 29









