ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఎడ్‌కోటర్‌లో బీసీ, ఐక్యవేదిక సమావేశం – స్కూలు హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీలకు సన్నాహాలు

ఎడ్‌కోటర్‌లో బీసీ, ఐక్యవేదిక సమావేశం – స్కూలు హాస్టళ్లపై ప్రత్యేక తనిఖీలకు సన్నాహాలు
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎడ్‌కోటర్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించబడింది. ఈ సమావేశంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా ఇన్‌ఛార్జి రాష్ట్ర కార్యదర్శి బుర్ర సోమేశ్వర్ గౌడ్ నేతృత్వంలో జిల్లాలోని బీసీ సంఘం నాయకులు, నాయకురాళ్లు పాల్గొన్నారు.

సమావేశంలో ముఖ్యంగా, జిల్లాలోని స్కూలు హాస్టళ్ల పరిస్థితులపై సమీక్ష నిర్వహించి, తొమ్మిది నుండి పది రోజుల వ్యవధిలో తనిఖీలు చేయాలని నిర్ణయించబడింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఈ తనిఖీలు ఎలక్ట్రానిక్ ఫ్రంట్ మీడియా సహకారంతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

జిల్లాలోని అన్ని పాఠశాలలు, హాస్టళ్ల పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించి, ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నారు. ఈ సందర్భంగా పత్రికా మిత్రులు ఐక్యవేదికకు సహకరించాలని విజ్ఞప్తి చేయబడింది.

ఇక, జూన్ 1వ తేదీన హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కలింగ భవన్‌లో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్రస్థాయి సమావేశం జరగనుంది. ఈ సమావేశాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు బీసీ సంఘాలన్నీ పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జాతీయ సలహాదారులు, జిల్లా స్థాయి నాయకులు పాల్గొననున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!