ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించిన ఎన్టీఆర్ కుటుంబ వారసులు
హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
తెలుగువారికి ఆదర్శంగా నిలిచిన ప్రముఖ నాయకుడు, నటసార్వభౌముడు నందమూరి తారక రామారావు 102వ జయంతిని పురస్కరించుకుని ఆయన మనవళ్లు జూనియర్ ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఈ ఉదయం ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకుని ఘన నివాళులు అర్పించారు.
ఎన్టీఆర్ ఘాట్ ప్రాంగణం ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలంకరించబడింది. అభిమానులు, పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో అక్కడికి తరలివచ్చారు. జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ తాతకు పుష్పగుచ్ఛం సమర్పించి మౌనంగా కొన్ని క్షణాలు నిలుచుని గౌరవం నివ్వారు.
ఈ కార్యక్రమం అనంతరం జూనియర్ ఎన్టీఆర్ సోషల్ మీడియా వేదికగా తన తాతపై భావోద్వేగభరితమైన భావాలను వ్యక్తం చేశారు. తాత అందించిన విలువలు, వారసత్వం తన జీవితానికి మార్గదర్శకమని పేర్కొన్నారు.
ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనవాయితీగా మారింది. ఈసారి కూడా భక్తిశ్రద్ధలతో, గౌరవ వాతావరణంలో కార్యక్రమం ముగిసింది.









