ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీడ్ కంపెనీలకు మంత్రి సీతక్క తీవ్ర హెచ్చరిక రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు

సీడ్ కంపెనీలకు మంత్రి సీతక్క తీవ్ర హెచ్చరిక
రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే క్రిమినల్ చర్యలు

హైదరాబాద్ ,ఆధాబ్ న్యూస్: నకిలీ విత్తనాల వల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించకపోతే సీడ్ కంపెనీలపై క్రిమినల్ చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సీతక్క హెచ్చరించారు. గురువారం హైదరాబాదులోని వ్యవసాయ డైరెక్టరేట్ కార్యాలయంలో సీడ్ కంపెనీల ప్రతినిధులతో ఆమె సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ములుగు జిల్లా వాజేడు, వెంకటాపూర్, కన్నాయిగూడెం మండలాల్లో నకిలీ విత్తనాల కారణంగా పంట నష్టం ఎదుర్కొన్న రైతులకు తక్షణమే పరిహారం చెల్లించాలని కంపెనీలను ఆదేశించారు. లేకపోతే సంబంధిత కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టి, క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

సమావేశంలో సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి, ములుగు జిల్లా కలెక్టర్ దివాకరా, వ్యవసాయ శాఖ అధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించి, నష్టపోయిన రైతుల వివరాలు సేకరించి, తగిన నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌కు సీతక్క ఆదేశించారు.

“నకిలీ విత్తనాలు సరఫరా చేయడాన్ని ఇకపై సహించేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేసి జైలుకు పంపిస్తాం” అని మంత్రి హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!