బయ్యారం సీఐ ఉమేష్ చంద్రనగర్ను సందర్శించిన ఘటన
పినపాక ఆధాబ్ న్యూస్:
పినపాక మండలంలోని వలస ఆదివాసి గ్రామమైన ఉమేష్ చంద్రనగర్ను మంగళవారం బయ్యారం సీఐ వెంకటేశ్వరరావు సందర్శించారు. ఈ సందర్భంగా గ్రామస్తులతో మాట్లాడుతూ, అసాంఘిక కార్యకలాపాలకు ఎవరైనా పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రతి ఒక్కరు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టీజీఎస్పి సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.
Post Views: 121









