ప్రతి క్షణం
ప్రజల పక్షం

  అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం .

అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి సందర్భంగా విగ్రహానికి నివాళులర్పించిన ఎమ్మెల్యే పాయం .

మణుగూరు , ఆధాబ్ న్యూస్
మణుగూరులోని అంబేద్కర్ సెంటర్ సమీపంలోని పెట్రోల్ బంక్ ఎదురుగా, క్షత్రియ సేవ సమితి ఆధ్వర్యంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 101వ వర్ధంతి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు సీతారామరాజు విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
అనంతరం, ఇటీవల కాశ్మీర్ పహాల్గంలో ఉగ్రవాది దాడిలో మృతి చెందిన భారతీయుల కోసం రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే, “అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన అల్లూరి శౌర్య ప్రతాపాలు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయి,” అని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్య సంగ్రామంలో శివాజీ తరువాత అంతటి పోరాట పటిమను చూపిన మహావీరుడు అల్లూరి సీతారామరాజు అని కొనియాడారు. ఆయన చరిత రానున్న తరాలకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బోల్లోజు అయోధ్య, మణుగూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిరినకి నవీన్, సిపిఐ, సిపిఎం, టిడిపి, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, క్షత్రియ సేవా సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు క్షత్రియ సేవా సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!